జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం

everyones responsibility of to make ys-jagan as cm - Sakshi

అంబాజీపేట: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పలువురు నాయకులు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రౌతులపూడి మండలం డీజే పురం శివారు క్యాంపు కార్యాలయం వద్ద తుని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు నాయకులు జగన్‌ సమక్షంలో  పార్టీలో చేరారు. 

తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, లోవ దేవస్థానం మాజీ చైర్మన్‌ దూలం మాణిక్యం, తలుపులమ్మ లోవ మాజీ బోర్డు సభ్యుడు తమరాను గౌరిపతినాయుడు, వి.కొత్తూరు పంచాయతీ మాజీ సర్పంచ్‌ పలివెల శ్రీనుబాబు, కళ్లి సింహాచలంతో పాటు పలువురు నాయకులు చేరారు. వారికి కండువాలు కప్పి జగన్‌ ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. వైఎస్‌ కుటుంబంపై లేని పోని అసత్యాలను ప్రచురిస్తే టీడీపీతో పాటు ఎల్లో మీడియాకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top