ఊబిలో పడిపోయిన ఇంజనీరింగ్ విద్యార్థి
విశాఖపట్నం: డుంబ్రిగూడ మండలం చాపరాయి ఊబిలో సాకేత్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీకాకుళం జిల్లాలోని జీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు విహార యాత్రకు వచ్చారు. వారితోపాటు సాకేత్ కూడా వచ్చాడు.
సాకేత్ స్వస్థలం హైదరాబాద్. విహార యాత్రకు మొత్తం 30 మంది విద్యార్థులు వచ్చినట్లు తెలుస్తోంది.
**