మీరిచ్చిన హమీతో ఉద్యోగ లోకం హర్షం

Employees happy With YS Jagan Guarantee - Sakshi

విశాఖపట్నం : వైఎస్సార్‌సీపీ అధి కారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దు చేస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో ఉద్యోగలోకం హర్షం వ్యక్తం చేస్తోం ది. సీపీఎస్‌ విధానంతో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 1,86,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్‌మెంట్‌ తర్వాత ఆసరా లేకుండా పోతుంది. గత ఎన్నికల సమయంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. దీనిపై శాంతియుతంగా చేస్తున్న ఆందోళన కార్యక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి మమ్మల్ని అక్రమంగా నిర్భందిస్తుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మా సీపీఎస్‌ ఉద్యోగులు సమస్యను స్పందించారు. సర్కారు బడులను ప్రోత్సహించేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన అమ్మఒడి పథకం చాలా గొప్పది. ఉద్యోగలోకం ఆయనకు మద్దతుగా నిలబడేందుకు సిద్ధంగా ఉంది.  – ఉద్యోగ బృందం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top