పింఛను పునరుద్ధరించయ్యా!
తూర్పుగోదావరి : ‘టీడీపీ అధికారంలోకి వచ్చాకా పింఛను తొలగించారయ్యా!’ అంటూ పెద్దాడకు చెందిన శిరపారపు సత్యనారాయణ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు సుమారు 70 ఏళ్లుంటాయని, వైఎస్ హయాంలో పింఛను పొందేవాడినని, టీడీపీ వచ్చాకా ఆధార్లో వయస్సు తక్కువ ఉందన్న సాకుతో తొలగించారని వాపోయాడు. కూలి పని చేసుకునే ఓపిక లేదని, వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పింఛను ఇచ్చి ఆదుకోవాలని కోరాడు.
సంబంధిత వార్తలు