నడవలేకున్నా.. జననేత కోసం..
తూర్పుగోదావరి :జగనన్న పాదయాత్రతో అందరి బంధువయ్యాడు.. కాలినడకన నడుస్తూ అందరి కష్టాలు తెలుసుకొని కన్నీళ్ళు తుడుస్తున్న జననేతను చూసేందుకు చిన్నారుల నుంచి పండు ముసలివాళ్ళ వరకూ తరలివస్తున్నారు. నడవడానికి ఏమాత్రం ఓపికలేని జగన్నాథపురానికి చెందిన వృద్ధురాలు కొల్లి చెల్లాయమ్మ సహచరుల సాయంతో జగన్ను చూసేందుకు పాదయాత్ర బాట పట్టారు.