రాజన్న బిడ్డ ఆప్యాయంగా పలకరించాడు..
తూర్పుగోదావరి :రాజన్న బిడ్డను చూసేందుకు వచ్చానని డీజే పురానికి చెందిన 80 యేళ్ల వృద్ధురాలు గదుల సూరయ్యమ్మ తెలిపారు. గ్రామానికి పాదయాత్రగా వచ్చిన జగన్ను నడవలేని స్థితిలో ఉన్న ఆమె చేతికర్రను ఊతంగా తీసుకుని స్థానికుల సహాయంతో కలుసుకుంది. తనకు వైఎస్ అంటే అభిమానమని, ఆయన తనయుడిని చూడాలని వచ్చినట్టు తెలిపింది. జగన్బాబు తనను ఆప్యాయంగా పలకరించాడని మురిసిపోయింది.