అవ్వా...నీ ఆరోగ్యం జాగ్రత్త!
ప్రజాసంకల్పయాత్ర బృందం: మన ప్రభుత్వం వస్తే వృద్ధులకు మంచి జరుగుతుంది. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ... వృద్ధులకు అండగా ఉంటామని గజపతినగరం మండలం లింగాలవలస గ్రామానికి చెందిన పైల చెల్లయ్యమ్మకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్ర లింగాలవలస గ్రామానికి చేరుకున్న సమయంలో ఆయనను కలిసేందుకు వచ్చిన పైల చెల్లయ్యమ్మ అనే వృద్ధురాలితో జగన్ మాట్లాడారు. వృద్ధురాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, రానున్నది మన ప్రభుత్వమేనని చెప్పి ధైర్యం నింపారు. దీంతో చెల్లయ్యమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది.