మాఫీ పేరుతో మోసం..
శ్రీకాకుళం : డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. పసుపు– కుంకుమ పేరుతో మహిళా సంఘాలకు మంజూరైన రూ.10 వేలు వడ్డీలకే సరిపోయింది. డ్వాక్రా రుణాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం. మా కాలనీలో గృహాలు శిథిలమయ్యాయి. మేమంతా వైఎస్సార్ సీపీకి చెందిన వారిమని టీడీపీ నేతలు ఇళ్లు ఇవ్వలేదు. శిథిలమైన ఒక్కొక్క ఇంట్లో రెండు,మూడు కుటుంబాలుంటున్నాయి. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. – కడగాన పార్వతి, తలే రామలక్ష్మి,పర్ర నాగమణి, ధవళపేట గ్రామం