మాటే రాదు
శ్రీకాకుళం :‘నా కుమార్తె యశశ్రీకి నోటిమాట రావడం లేదన్నా. పుట్టినప్పటి నుంచి తలతో ఏదో అయ్యింది. ఎందరికి చూపినా ఫలితం లేదు’ అంటూ జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన రత్నకుమారి జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాప మందులకైనా పింఛన్ ఇవ్వడం లేదని, నిరుపేదలమైన తమకు ఏం చేయాలో పాలుపోవడం లేదని అన్నారు. పగవారికి కూడా ఈ కష్టం రాకూడదని కన్నీరు పెట్టుకున్నారు.