నిధులు మంజూరైనా..
విజయనగరం : వెంకటాపురం గ్రామానికి 2013–14 ఆర్థిక సంవత్సరంలో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 1.28 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఇంతవరకు పనులు చేపట్టలేదు. పనులు చేపట్టాలే చర్యలు తీసుకోవాలని జగన్మోహన్రెడ్డిని కోరాం. – వెంకటాపురం గ్రామస్తులు,సీతానగరం మండలం
రాకపోకలకు అవస్థలు
సువర్ణముఖీ నదికి ఆనుకుని ఉన్న పెదంకలాం కాలువపై వంతెన లేకపోవడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.ముఖ్యంగా పెదంకలాం, చినంకలాం గ్రామాలకు వెళ్లాలంటా నీటిలో దిగాల్సిందే. ఈ విషయాన్ని టీడీపీ నాయకులకు తెలియజేసినా పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పెదంకలాం వద్ద వంతెన నిర్మించాలి.
– బి.శ్రీరాములునాయుడు, సీతానగరం
సంబంధిత వార్తలు