డిగ్రీ కళాశాల లేక ఇక్కట్లు..
విజయనగరం :సీతానగరం మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో సుమారు 400 మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించి చదువుకోవాల్సి వస్తోంది. నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డిగ్రీ కళాశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జగనన్నను కోరాను. – నీలిమ, సీతానగరం.
మార్గం లేదు..
జంఝావతి కాలువ నిర్మించారు. ఎగువన సుమారు 900 ఎకరాల భూములన్నాయి. వాటికి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 24వ కిలోమీటరు వద్ద కల్వర్టు నిర్మిస్తే రైతుల రాకపోకలకు సులువవుతుంది. – నిడగల్లు రైతులు, సీతానగరం మండలం