'వైఎస్ జగన్పై హత్యాయత్నం వెనుక చంద్రబాబు కుట్ర'
సాక్షి, తిరుపతి : వైఎస్సార్సీపీ అధినేత..విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద దళిత ఐక్యమహానాడు ఆధ్వర్యంలో ధర్నానిర్వహించారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం వెనుక సీఎం చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని ఐక్య దళిత మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లూరు చెంగయ్య ధ్వజమెత్తారు. పథకం ప్రకారమే దళిత యువకుడిని ఎంపిక చేసుకున్నారని అన్నారు.
దళిత యువకుడి కుటుంబానికి ముందుగానే ప్రభుత్వం లబ్ది చేకూర్చిందని, దళిత యువకుడైతే కేసులుండవని టీడీపీ ఎత్తగడ వేసిందని చెంగయ్య అన్నారు. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు