ఉపాధి కల్పించండయ్యా
సాక్షి, విశాఖపట్నం:మేమంతా రావికమతం మండలం కొత్తకోట వాసులం. సుమారు 200 కుటుంబాలు స్థానికంగా లభ్యమయ్యే అడ్డాకులతో విస్తర్లు కుట్టి ఉపాధి పొందుతున్నాం. విస్తర్లు కుడితే కాని పూట గడవని పరిస్థితి. పేపర్ ప్లేట్లు వచ్చాక విస్తర్లను వాడడం మానేశారు. దీంతో మాకు ఉపాధి లేకుండా పోయింది. కూలీ పనులు కూడా దొరకడం లేదు. కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని మేమంతా ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించం. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే విస్తర్లకు ప్రత్యామ్నాయంగా ఏదైన చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరాం.– కొత్తకోట మహిళలు
కుల వృత్తులనుపట్టించుకోవడం లేదన్నా..
మాది పాయకరావుపేట మండల కేంద్రం. నేను వండ్రంగి పని చేస్తుంటాను. ప్రతి పని చేతితోనే చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం మా కులవృత్తుల వారిని ఆదు కోవంలో పూర్తిగా విఫలమైంది. మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజా సంకల్పయాత్రను వచ్చిన జగనన్నను కలిసి సమస్యను వివరించాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగా నే కులవృత్తుల వారికి అవసరమైన యంత్రాలను సబ్సిడీపై అందించాలని కోరాను.– వి.వి.సత్యనారాయణ, కులవృత్తుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు,పాయకరావుపేట