సీపీఎస్ను రద్దు చేయాలి
శ్రీకాకుళం ,రాజాం/జి.సిగడాం : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసేందుకు కృషి చేయాలని జి.సిగడాం మండలానికి చెందిన ఏపీసీపీఎస్ఈఏ సంఘ ఉపాధ్యక్షురాలు మక్క గంగేశ్వరి, ఉద్యోగులు మొయ్యి జనార్దనరావు, కొరికాన శంకరరావు, సూరి, రాము, రమణ, మక్క సూరపునాయుడు, కేవీఆర్ తదితరులు కోరారు. బుధవారం జి.సిగడాం మండలంలోని ఆనందపురం జంక్షన్ వద్ద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ వద్ద ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండాపోయిందన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. అనంతరం జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చానని, అధికారంలోకి రాగానే ఉద్యోగులకు న్యాయం చేస్తామని పునరుద్ఘాటించారు.