యూనిఫారాల్లో రూ.కోట్లు దోపిడీ
శ్రీకాకుళం :‘సార్.. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇస్తున్న యూనిఫారాల మంజూరులో రూ.కోట్లలో దోపిడీ జరుగుతోంది’ అని గాయత్రి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శవ్వాని ఉమామహేశ్వరి ప్రతిపక్ష నేతకు తెలిపారు. విద్యార్థుల యూనిఫారాల బాధ్యత ఆప్కోకు అప్పగించగా ఆ సంస్థ చైర్మన్ గుజ్జల శ్రీను, మంత్రి అచ్చెన్నాయుడు అండతో రూ.కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ఈ విద్యా సంవత్సరంలో అతనికి లంచం ఇవ్వలేదని రూ.కోటి వరకు నిధులు ఇవ్వలేదని తెలిపారు.