కరోనా: విశాఖలో మరో రెండు.. మొత్తం 21
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 21కి చేరుకుంది. విశాఖపట్నంలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో ఈ విషయాలను వెల్లడించారు. బర్మింగ్హామ్ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ వ్యక్తిని ఈ ఇద్దరు కలవడంతోనే వారికి ఈ వైరస్ వ్యాపించిందన్నారు.
ఈరోజు 102 మందికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారని.. అందులో వంద మందికి నెగటివ్గా నిర్దారణ అయిందన్నారు. విశాఖలో కరోనా పాజిటివ్గా తేలిన 65ఏళ్ల వ్యక్తికి చికిత్స అనంతరం మరో రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా నెగటివ్గా నిర్దారణ అయిందని మరోసారి పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇక ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 616 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 495 మందికి కరోనా నెగటివ్గా నిర్దారణ అయిందని.. మరో 100 మంది ఫలితాలు పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు.
చదవండి:
చైనా మొదలెట్టింది.. థూ! మీరిక మారరా?..
‘లాక్డౌన్ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’
ఆ 11 మంది రేపు డిశ్చార్జ్ : కేసీఆర్