కొత్తగా మరో 62 పాజిటివ్‌

Coronavirus Positive Cases Rises To 955 In Andhra Pradesh - Sakshi

ఏపీలో 955కు చేరిన మొత్తం కేసులు

కర్నూలులో 27, కృష్ణాలో 14,గుంటూరు జిల్లాలో 11 నమోదు

24 గంటల్లో 6,306 శాంపిల్స్‌ పరీక్ష

నలుగురు డిశ్చార్జ్, ఇద్దరు మృతి

ఇప్పటివరకు మొత్తం 145 మంది డిశ్చార్జ్, 29 మరణాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 955కు చేరింది. గురువారం ఉ.9 గంటల నుంచి శుక్రవారం ఉ.9 గంటల వరకు మొత్తం 6,306 శాంపిల్స్‌ను పరీక్షించగా 62 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 27 కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 261కు చేరింది. ఆ తర్వాత కృష్ణాజిల్లాలో 14 కేసులు నమోదు కావడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 102కు చేరింది. ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో 11 కేసులు నమోదు కాగా..  మొత్తం కేసుల సంఖ్య 206కి పెరిగింది. ఇక అనంతపురం జిల్లాలో 4, ప్రకాశంలో మూడు, తూర్పు గోదావరి జిల్లాలో 2,  నెల్లూరులో ఒక కేసు చొప్పున నమోదయ్యాయి.

145 మంది డిశ్చార్జి
ఇదిలా ఉంటే.. కరోనా నుంచి కోలుకుని శుక్రవారం నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. వీరంతా అనంతపురం జిల్లాకు చెందిన వారేనని బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 145 అయింది. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా బారినపడి తాజాగా ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. వీరితో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య మొత్తం 29కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులలో 781 మంది చికిత్స పొందుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top