సీఎం జగన్కు ప్రధాని మోదీ ఫోన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్తో మోదీ చర్చించారు. అంతకు ముందు ప్రధాని మోదీ వరుసగా పలువురు నేతలకు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రులకు ఫోన్లు చేశారు. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, దేవెగౌడలకు ఫోన్ చేసి కరోనా మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
(చదవండి : థ్యాంక్యూ జగన్జీ : ప్రధాని)
మరోవైపు కరోనా నియంత్రణపై సీఎం జగన్ ఆదివారం సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఆస్పత్రిలో విధిగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ కరోనా టెస్టింగ్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకురావాలని, ఇప్పుడున్న ల్యాబ్ ల సామర్థ్యం పెంచాలని పేర్కొన్నారు.
(చదవండి : ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డుకు సీఎం జగన్ ఆదేశం)
సంబంధిత వార్తలు