ఏపీలో మరో 299 కరోనా కేసులు

CoronaVirus Latest Update In AP 299 New Cases Registered - Sakshi

సాక్షి, అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 299 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 5854 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా 13,923 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 299 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది.  గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 77 మంది డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 92కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,983 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 2,779 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. (కరోనాతో ఆటవిక తెగల యోధుడి అస్తమయం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top