ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు
కర్నూలులో 500 దాటిన కరోనా కేసులు
గుజరాత్ నుంచి వచ్చిన 14 మందికి కరోనా పాజిటివ్
మొత్తం 1,717కి చేరిన కరోనా కేసులు
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 67 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,717కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 8,263 పరీక్షలు నిర్వహించగా.. 67 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలిపింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 2, గుంటూరులో 13, వైఎస్సార్ జిల్లాలో 2, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 1, విశాఖపట్నం జిల్లాలో 2 కరోనా కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. అలాగే గుజరాత్ నుంచి వచ్చిన 14 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని వెల్లడించింది.
గడిచిన 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వీరిలో కర్నూలు జిల్లాలో 28, గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, వైఎస్సార్ జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్కరు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు 589 కరోనా నుంచి కోలుకోగా.. 34 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,094 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. (చదవండి : ఏపీలో మద్యం ధరలు మరో 50 శాతం పెంపు.. )
జిల్లాల వారీగా కరోనా కేసులు..