ఏపీలో కొత్తగా 2,412 కరోనా కేసులు

Coronavirus : 2412 New Cases In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 2,412 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,451కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2,412 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రికార్టు స్థాయిలో 12,17,963 శాంపిల్స్‌ను పరీక్షించారు. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 20 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. (ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ)

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 805 మంది డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 18,378కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,621 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 452 మంది మృతిచెందారు. (కోవిడ్‌ పరీక్షలు మరింత వేగంగా చేయనున్న ఏపీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top