ఏపీలో 13 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Corona tests exceeding 13 lakhs in AP - Sakshi

మొత్తం పాజిటివ్‌ కేసులు 49,650 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 13 లక్షల మార్కును అధిగమించాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు 31,148 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా మొత్తం పరీక్షల సంఖ్య 13,15,532కి చేరింది. గడిచిన 24 గంటల్లో 5,041 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మొత్తం పాజిటివ్‌ కేసులు 49,650కి చేరాయి. 1,127 మంది డిశ్చార్జ్‌ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 22,890కి చేరింది. తాజాగా 56 మంది మృతితో మొత్తం మరణాల సంఖ్య 642కి చేరింది. యాక్టివ్‌ కేసులు 26,118 ఉన్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top