ఏపీలో 8 లక్షలు దాటిన  కరోనా పరీక్షలు

Corona Tests Exceeded Eight lakhs in Andhra Pradesh - Sakshi

ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 5,480

తాజాగా 796 కేసులు నమోదు

మొత్తం కేసుల సంఖ్య 12,285  

సాక్షి, అమరావతి: కరోనా పరీక్షలు చేయడంలో ఏపీ ప్రభుత్వం 8 లక్షల మార్కును అధిగమించింది. శుక్రవారం ఉదయం 9 నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 24,458 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన  పరీక్షల సంఖ్య 8,16,082కు చేరింది. ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 15,282 మందికి పరీక్షలు నిర్వహించి అగ్రస్థానంలో నిలిచింది. కరోనా నుంచి కోలు కోవడంతో తాజాగా 284 మందిని డిశ్చార్జి చేసి నట్టు వైద్య, ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్ప టివరకు కోలుకున్న వారి సంఖ్య 5,480కు చేరు కుంది.

ఇదిలావుంటే.. గడచిన 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,285కు చేరింది. ఇందులో 1,815 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, 377 మంది విదే శాల నుంచి వచ్చిన వారున్నారు. గత 24 గంటల్లో వివిధ జిల్లాల్లో 11 మంది మరణించడంతో మొ త్తం మరణాల సంఖ్య 157కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆస్ప త్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 6,648 మంది చికిత్స పొందుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top