14 లక్షలకు చేరువలో కరోనా పరీక్షలు

Corona tests is close to 14 lakhs in AP - Sakshi

24 గంటల్లో 1346 మంది డిశ్చార్జ్‌

మరో 4,944 మందికి పాజిటివ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పరీక్షలు 14 లక్షలకు చేరువలో ఉన్నాయి. మంగళవారం నాటికి మొత్తం పరీక్షల సంఖ్య 13,86,274కి చేరింది. 24 గంటల్లో 37,162 మందికి పరీక్షలు నిర్వహించగా 4,944 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 58,668కు చేరింది. 1,346 మంది డిశ్చార్జ్‌ కావడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 25,574కి చేరింది.

కోవిడ్‌ కారణంగా కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో 10, విశాఖ 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 7, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కర్నూలు నలుగురు, వైఎస్సార్, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 758కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ప్రతి పది లక్షల మందిలో 25,960 మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 32,336 ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top