8 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

Corona tests beyond 8 lakhs in AP - Sakshi

ఒకే రోజు 284 మంది డిశ్చార్జి

ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 5,480

తాజాగా 796 కేసులు నమోదు

మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,285 

సాక్షి, అమరావతి: కరోనా పరీక్షలు చేయడంలో ఏపీ ప్రభుత్వం 8 లక్షల మార్కును అధిగమించింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 24,458 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 8,16,082కు చేరింది. ప్రతి 10 లక్షల జనాభాకు సగటున 15,282 మందికి పరీక్షలు నిర్వహించి అగ్రస్థానంలో నిలిచింది.

కరోనా నుంచి కోలుకోవడంతో తాజాగా 284 మందిని డిశ్చార్జి చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 5,480కు చేరుకుంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 796 కేసులు నమోదు కాగా.. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,285కు చేరింది. ఇందులో 1,815 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉండగా, మరో 377 మంది విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. గడచిన 24 గంటల్లో వివిధ జిల్లాల్లో 11 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 157కు చేరింది.
– ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయాధికారులకు చెందిన నాలుగు కుటుంబాల్లో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top