వాళ్లిద్దరూ కోలుకుంటున్నారు

Corona Patients discharge in Hindupur Anantapur - Sakshi

కరోనా బారినపడ్డ వారి ఆరోగ్యం బాగుందన్న వైద్యులు

‘పురం’ క్వారంటైన్‌ నుంచి 29 మంది డిశ్చార్జ్‌  

అనంతపురం, హిందూపురం: కరోనా బారిన పడి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న లేపాక్షికి చెందిన పదేళ్ల బాలుడు, హిందూపురానికి చెందిన మహిళ కోలుకుంటున్నారని డాక్టర్‌ కేశవులు తెలిపారు. వారి ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోందన్నారు. ఇక ఆస్పత్రిలోని క్వారంటైన్‌లో ఉన్న 29 మందిని గురువారం డిశ్చార్జ్‌ చేశామన్నారు. వీరందరినీ మార్చి 22 నుంచి క్వారంటైన్‌ వార్డులో ఉంచి చికిత్సలు అందిస్తూ వచ్చామని, తాజాగా వారికి కరోనా పరీక్షలు చేయగా వైరస్‌ లేదని తేలడంతో ఇళ్లకు పంపామన్నారు. అయినప్పటికీ వారంతా ఈ నెల 12న వరకూ ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాలన్నారు. ఇక మలుగూరుకు చెందిన ఓ వ్యక్తిని మాత్రం ఈ నెల 25 వరకూ ఇంటిలోని క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించామన్నారు. ఇదిలాఉంటే పట్టణంలో రెడ్‌జోన్‌గా నిర్ణయించిన టిప్పుఖాన్‌ స్ట్రీట్‌లో ప్రజల సంచారాన్ని పూర్తిగా నిషేధించినట్లు తహసీల్దార్‌ శ్రీనివాసులు, కమిషనర్‌ భవానీప్రసాద్‌  తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top