ఏపీలో కొత్తగా 98 పాజిటివ్‌ కేసులు

Corona: 98 New Positive Cases Registered In AP On Wednesday - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మెల్లమెల్లగా అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో(బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు) 9,986 కరోనా పరీక్షలు నిర్వహించగా 98 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 29 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. నిన్న ఒక్క రోజు కోవిడ్‌ వల్ల గుంటూరు, కృష్ణా, కర్నూలులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. (ఒక్క రోజులో భారీగా కరోనా కేసులు)

రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో నెల్లూరులో 19 మంది కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,377 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా 2,273 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 71కు చేరగా, ప్రస్తుతం 1,033 మంది వివిధ కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. (పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top