మంత్రి కులాన్ని కించపరిచిన వ్యక్తిపై ఫిర్యాదు

Complaint Lodged Against The Man Who Made Remarks On Anil Kumar Yadav Caste - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్‌ యాదవ్ కులాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన అసభ్య పోస్టింగ్పై సత్యనారాయణ పురం పీఎస్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కులానికి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అసభ్యపదజాలంతో దూషించడాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వ్యక్తి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులకు విన్నవించామని తెలిపారు. చివరగా బీసీలకు ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని అభిప్రాయ పడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top