రేషనలైజేషన్‌పై కమిటీ వేయాలి


విజయనగర అర్బన్: విద్యార్థులు, ఉపాధ్యాయ పోస్టులపై అమలు చేసిన రేషనలైజేషన్ జీవోలు 55,61 లను రద్దు చేసి ఈ ప్రక్రియపై కమిటీని వేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  ఎ.సదాశివరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో సంఘం జిల్లా కమిటీ అధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషనలైజేషన్‌పై వేసిన కమిటీ నివేదిక ఆధారంగా అమలు చేయాలని కోరారు. విద్యాసంవత్సరం చివరి నెలల్లో ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే చర్యలు మానుకోవాలని కోరారు.

 

  పీఆర్‌సీ అనుబంధ జీవోలు, రెండు విడతల డీఏ బకాయి జీవోలు తక్షణమే విడు దల చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యకార్డులు పూర్తిస్థాయిలో అమలయ్యేటట్లు ప్రభుత్వం వెంటనే చర్చలు తీసుకోవాలని కోరారు. ఏకీకృత సర్వీసు రూల్స్ కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. అన్ ట్రైన్డ్ ఎస్సీ,ఎస్టీ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్‌లను మంజూరు చేయాలని  కోరారు. సంఘం అధ్యక్షుడు డి.ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి జేసీరాజు, ఉపాధ్యక్షులు ఎన్‌వీపైడిరాజు, కె.శ్రీనివాసరావు, వి.అప్పలరాజు, సీహెచ్‌వీఎస్‌ఎన్‌మూర్తి, చినసత్యనారాయణ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top