కొలువు గాలిలో దీపంలా ఉందన్నా..

College full time guest faculty teachers meets ys jagan mohan reddy - Sakshi

ఉద్యోగాలకు భద్రత లేదని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాల ఫుల్‌టైమ్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల సంఘం సభ్యులు జగన్‌ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శనివారం పాదయాత్రలో ఆయనను కలిసి తమ సమస్యలను చెప్పుకొన్నారు. రాష్ట్రంలో పదేళ్ళుగా 1,360 మంది ఫుల్‌టైమ్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నామని,  అయినా తమకు ఉద్యోగ భద్రత లేకపోవడమే కాకుండా వేతనం పెంపుదల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నామని ఎం.రజని,  సీహెచ్‌ సత్తిబాబు, ఆర్‌ కృష్ణవేణి, సీహెచ్‌ దొరబాబు, ఎస్‌ఎల్‌వీఎస్‌ నారాయణ వివరించారు.  రెగ్యులర్‌ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నా సదుపాయాలలో ఏ మాత్రం  న్యాయం చేయడంలేదన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top