హైదరాబాద్కు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్ బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు పయనం అయ్యారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కుమారుడు ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. అనంతరం హోటల్ తాజ్కృష్ణలో ఓ వివాహ కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కానున్నారు.