స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి : ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష ప్రారంభించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అదే విధంగా మధ్యాహ్నం విద్యాసంస్కరణల కమిటీతో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.