ప్రత్యేక హోదాపై మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం

cm chandrabu naidu commented on ap special status - Sakshi

సాక్షి, అనంతపురం : విభజన చట్టం హామీల అమలు కోసం పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండలో కియా కార్ల పరిశ్రమ ఇన్‌స్టాలేషన్‌ విభాగాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం ఏ రోజు కృషి చేయని సీఎం, తన మాటలతో మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.

విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ కోలుకోవడానికి ప్రత్యేక హోదా అవసరమని, అదే కేంద్రాన్ని అడిగామని, కానీ కేంద్రం అందుకు అంగీకరించలేదని అన్నారు. హోదాతో సమానమైన ప్రయోజనాలు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో ఇస్తామంటేనే ఒప్పుకున్నామంటూ మరోసారి పాత పాటే పాడారు. ప్రత్యేక హోదాతోనే పారిశ్రామిక అభివృద్ది సాధ్యమవుతుందని, విభజన హామీల అమలుకు పోరాటం చేస్తామని బాబు ఏపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top