రేపు సీఎం జగన్‌తో భేటీ కానున్న చిరంజీవి

Chiranjeevi Will Meet YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రముఖ హీరో చిరంజీవి భేటీ కానున్నారు. సోమవారం మధ్యాహ్నం సీఎం వైఎస్‌ జగన్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాగా, ఇటీవల చిరంజీవి నటించిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ దర్శకుడు సురేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. రామ్‌చరణ్‌ నిర్మించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top