జగనన్నను ఆశీర్వదించండి

Cherukulapadu kangati srideevi garu plz Blessing to ys jagan - Sakshi

పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి పిలుపు 

పెద్దహుల్తిలో 30 కుటుంబాలు 

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక 

పత్తికొండ టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించాలని పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి పిలుపునిచ్చారు. జగనన్న అధికారంలోకి వస్తే మనందరికీ అండగా ఉంటారని అన్నారు. మండల పరిధిలోని పెద్దహుల్తి గ్రామంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు ఆదివారం రాత్రి చెరుకులపాడు శ్రీదేవి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాయి. వారందరికీ ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఆమెకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. శ్రీ హుల్తి లింగేశ్వరస్వామి దేవాలయంలో పూజల అనంతరం గ్రామ నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన సభలో వండ్రప్ప, రామాంజిని, రవి, రంగయ్య, లక్ష్మినారాయణ, రామకృష్ణ, రాజబాబు, రమేశ్‌తో పాటు 30 కుటుంబాలకు చెందిన వాల్మీకులు, ఎస్సీలు శ్రీదేవి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెలాఖరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పత్తికొండకు వస్తున్నారన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి సి.శ్రీరంగడు, మండల కన్వీనర్‌ జూటూరు బజారప్ప, అడ్వకేట్‌ కారం నాగరాజు, స్థానిక నాయకులు నక్కల కారుమంచి, చెన్నంపల్లి జయకృష్ణ, టైలర్‌ నాగరాజు, చాకలి తిమ్మప్ప పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top