చేపలుప్పాడ పేరు మార్చాలి
విశాఖపట్నం: చేపలుప్పాడ గ్రామం పేరును మార్చాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు జిల్లా అధికారులకు సూచించారు. అభివృద్ధి చెందుతున్న నగరాన్ని ఆనుకుని ఉన్నందున ఈ గ్రామం పేరును నారాయణ మత్స్యపురిగా మారిస్తే బాగుంటుందన్నారు.
అంతకుముందు గ్రామంలో రూ.8.50 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పంచాయతీ భవనం, తుపాన్ షెల్టర్, తాగునీటి పథకంతోపాటు పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ఎంపి హరిబాబు, జీఎం ఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, స్వర్ణ భారతి ట్రస్ట్ చైర్మన్ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.