కైలాసగిరిపై చిరుతల కలకలం
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని కైలాసగిరిపై చిరుతలు కలకలం రేపాయి. కైలాసగిరిపై రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు తెలుసుకుని పర్యాటకులు హడలిపోతున్నారు. దీంతో ఆ ప్రాంతానికి వచ్చిన అటవీ అధికారులు అక్కడినుంచి పర్యాటకులు, వ్యాపారులను ఖాళీ చేయించారు. చిరుతల కోసం అటవీ శాఖాధికారులు గాలిస్తున్నారు. అయితే అవి ఎటువైపు నుంచి వచ్చాయి, ఎటు వెళ్లాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు.
కాగా, కైలాసగిరిపై రెండు పులులు కన్పించడంతో అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. రెండు రోజులలో పులులను పట్టుకుంటామని, ఇందుకోసం బోనులు, సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పులులను పట్టుకునేవరకు కైలాసగిరిపైకి టూరిస్టులను అనుమతించటం లేదన్నారు.