వైఎస్సార్‌ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు

Charitable activities On YS Rajasekhara Reddy Vardhanthi - Sakshi

సాక్షి, అమరావతి: దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 10వ వర్ధంతిని సెప్టెంబర్‌ రెండో తేదీన ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ తన శ్రేణులకు పిలుపు నిచ్చింది. ఆ రోజున సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయనకు నివాళులు అర్పించాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఒక సర్క్యులర్‌  జారీ చేశారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని స్థాయిలలో వైఎస్‌ జ్ఞాపకాలను ప్రజలు స్మరించుకునేలా ఉదయం 9 గంటలకు నివాళులు అర్పించిన అనంతరం అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలలో పండ్లు, దుస్తుల పంపిణీతో పాటు రక్తదాన శిబిరాలు, అన్నదానం వంటి  కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top