మత్య్సకారుల సంక్షేమంపై చంద్రబాబు నిర్లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం:మేమంతా మత్య్సకారులం. బీచ్ రోడ్డులోని వాసవానిపాలెం పరిధిలోని జాలరి ఎండాడలో నివసిస్తున్నాం. సుమారు వెయ్యి కుటుంబాలకు పైనే ఉన్నాం. మత్య్సకారుల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు నిర్లక్ష్యధోరణి అవలంబిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మత్య్సకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఎస్టీ జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చి నిలువునా మోసం చేశారు. మత్య్సకారులు వేటకు విరామం ప్రకటించిన సమయంలో ఒక్కొక్క కుటుంబానికి కేవలం రూ.4 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న మా ఇళ్లు తరచూ సముద్రపు కోతకు గురవుతున్నాయి. సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లను నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. మా సమస్యలను వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే మత్స్యకారుల సమస్యలు పరిష్కారవుతాయి.