ప్రభుత్వ వ్యూహంపై చంద్రబాబు చర్చ
హైదరాబాద్: శాసనసభ సమావేశాల నిర్వహణ, సభలో ప్రభుత్వం అనుసరించవలసిన వ్యూహంపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడ మంత్రులు, ప్రభుత్వ చీఫ్ విప్, విప్లో చర్చించారు. లేక్వ్యూ గెస్ట్హౌస్లో జరిగిన సమావేశంలో బడ్జెట్లో శాఖలవారీగా కేటాయింపులపై చర్చించారు.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ సమావేశానికి టిడిపి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా హాజరయ్యారు.