అప్పుల పాలయ్యాను
గత ఎన్నికల్లో చంద్రబాబు రుణ మాఫీ చేస్తాననడంతో బ్యాంకులో తీసుకున్న రూ.40 వేలు రుణాన్ని కట్టలేదని, తీరా రుణం మాఫీ కాకపోవడంతో అప్పు తీర్చేందుకు ప్రైవేటు అప్పు చేయాల్సి వచ్చిందని తాళ్లరేవుకు చెందిన పుట్టా లక్ష్మి వాపోయింది. చివరకి ఊరు వదిలి కాకినాడలో పనులు చేసుకుని జీవిస్తున్నానని, తనను ఆదుకోవాలని ఆమె జగన్ను కోరింది.