వాకతిప్ప మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వెళ్లారు. కాకినాడ ఆస్పత్రిలో బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటంబ సభ్యులతో మాట్లాడారు.
మృతుల కుటుంబాలకు చంద్రబాబు 3 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అంతేగాక బాధిత కుటుంబాలకు అర ఎకరం భూమి, ఇల్లు నిర్మించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనుమతులు లేని బాణాసంచా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. సోమవారం యూ కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణాసంచా గోదాములో పేలుడు జరిగిన ప్రమాదంలో 18 మరణించగా, మరికొందరు గాయపడిన సంగతి తెలిసిందే.