జగనన్న సీఎం కావాలని...
అల్లిపురం(విశాఖ దక్షిణం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షిస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాని సైకిల్పై సంకల్ప యాత్రలో పాల్గొంటున్నాడు. సైకిల్పై ప్రయాణిస్తూ నవరత్నాలను ప్రచారం చేస్తున్నాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు మండలం, లింగారెడ్డి కాలనీకి చెందిన పొగులూరి అల్లూరయ్య అలియాస్ ఇసాక్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పాదయాత్రలో పాల్గొంటున్నాడు. ఇచ్ఛాపురం వరకూ జననేత జగనన్నతో పయనిస్తానని చెప్పాడు. గతంలో రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని మర్కాపురం నుంచి ఇడుపులపాయ వరకూ సైకిల్పై శాంతియాత్ర చేశానని, తరువాత జగనన్న ఓదార్పు యాత్ర విజయవంతమవ్వాలని విజయవాడ నుంచి ఇచ్ఛాపురం వరకూ...షర్మిల బస్సు యాత్ర విజయవంతం కోరుతూ విజయభేరి యాత్ర పేరుతో మర్కాపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ.. ఇప్పుడు జగనన్న సంకల్ప యాత్రలో పాల్గొంటున్నట్టు చెప్పాడు.
సంబంధిత వార్తలు