విద్యుత్‌ స్తంభం తొలగింపునకు రూ.10 వేలు అడుగుతున్నారు

Bribery Demand For Power Poll Remove - Sakshi

తూర్పుగోదావరి :తమ స్థలంలో ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని తొలగించడానికి అధికారులు రూ.10 వేలు అడుగుతున్నారని కాపవరానికి చెందిన అత్తాకోడళ్లు ముక్కు సుభద్రమ్మ, జయలక్ష్మి జగన్‌కు తెలిపారు. పాదయాత్రలో వారు జననేతను కలుసుకుని సమస్యను వివరించారు. ‘ఎనిమిదేళ్ల క్రితం ఇల్లు కట్టుకోవడానికి అడ్డు వస్తే స్తంభం తొలగించాలని విద్యుత్‌ శాఖ అధికారులను కోరితే తొలగిస్తాం, మీరు ఇల్లు కట్టుకోండని తెలిపారు. ఏళ్లు గడుస్తున్నా స్తంభాన్ని తొలగించలేదు. తొలగించాలంటే రూ.10 వేలు చెల్లించాలని ఇప్పుడు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలి’ అని అభ్యర్థించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top