ప్రేమించి మోసం చేసిన యువకుడి అరెస్టు

Boy Friend Arrest Cheating Case In Vizizanagaram - Sakshi

విజయనగరం, పూసపాటిరేగ: యువతిని ప్రేమ పేరుతో నమ్మించి శారీకంగా కలిసి మోసం చేసి ముఖం చాటేసిన ప్రియుడు ఉదంతమిది. వివరాల్లోకి వెళ్తే...పూసపాటిరేగ మండలం  గైతులు చోడవరానికి చెందిన 18 ఏళ్ల యువతి, పూసపాటిరేగకు చెందిన వాడపల్లి రమేష్‌  మూడేళ్లుగా ప్రేమించుకొంటున్నా రు. ప్రేమ పేరుతో శారీరకంగా ఒకటైన ఇద్ద రు కలిసి మెలిసి తిరుగుతూ ఉండేవారు. యువతి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బులను ప్రియుడి జల్సాలకు ఇచ్చేది.

వ్యవహారం నడుస్తుండగా ఈ ఏడాది మే నెలలో ప్రియుడు తమ దగ్గర బంధువులకు చెందిన వేరే యువతిని వివాహం చేసుకొన్నాడు.  తన మాటేమిటని తనను పెళ్లి చేసుకోవాలని యువతి ప్రియుడు రమేష్‌పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ప్రియుడు ఫోన్‌ చేసినా లిఫ్టు చేయకపోవడంతో పాటు ముఖం చాటేసాడు. మోసపోయానని గుర్తించిన యువతి పూసపాటిరేగ పోలీసులును ఆశ్రయించింది. పూసపాటిరేగ పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇరువురిని విచారణ చేసిన ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ టి.త్రినాధరావు, ఎస్‌ఐ కృష్ణమూర్తి యువకుడిపై 417, 376 సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

కఠినంగా శిక్షించాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని  ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు పి.రమణమ్మ డిమాండ్‌ చేశారు.   యువకుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  ఐద్వా  నేతలు జి.పుణ్యవతి, ఘాన్సీలక్ష్మీభాయ్‌ వీర సంఘం నాయకులు తుమ్మి లక్ష్మీరాజ్, సీఐటీయూ నాయకుడు బి.సూర్యనారాయణ వున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top