సీట్ల ప్రాతిపదికన భూములు కేటాయించడమా?
హైదరాబాద్: ప్రభుత్వ భూములను సీఎం చంద్రబాబునాయుడు కొట్టేయాలని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలకు చంద్రబాబు విలువైన భూములను తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
రాజధాని కోసమంటూ రైతుల భూములను లాక్కుంటున్నారని బొత్స అన్నారు. సీట్ల ప్రాతిపదికన పార్టీలకు భూములు కేటాయించడం ఏంటి అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బందర్ పోర్టుకు 5వేల ఎకరాలు చాలని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక లక్ష ఎకరాలు కావాలంటున్నారని మండిపడ్డారు.