మహానేతకు పుస్తకం అంకితం
సాక్షి, విశాఖపట్నం:ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ పి.ప్రేమానంద్ రచించిన ‘సోషల్ స్ట్రగుల్ ఆఫ్ దళిత్ ఇన్ ఇండియా’ అనే పుస్తకాన్ని బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మొదటిసారిగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్టినట్టు గుర్తు చేశారు. ఆయనపై ప్రేమాభిమానాలతో ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004–2009 వరకు పాలనలో ఎస్సీలకు చేసిన మేలు, ఆయన పథకాల ద్వారా ఎస్సీలు ఎలా లబ్ధిపొందారో పుస్తకంలో వివరించినట్టు చెప్పారు. డాక్టర్ ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు