మహానేతకు పుస్తకం అంకితం

Book Present To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం:ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ పి.ప్రేమానంద్‌ రచించిన ‘సోషల్‌ స్ట్రగుల్‌ ఆఫ్‌ దళిత్‌ ఇన్‌ ఇండియా’ అనే పుస్తకాన్ని బుధవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత మాట్లాడుతూ ఆంధ్ర విశ్వ విద్యాలయంలో మొదటిసారిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్టినట్టు గుర్తు చేశారు. ఆయనపై ప్రేమాభిమానాలతో ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నట్టు తెలిపారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004–2009 వరకు పాలనలో ఎస్సీలకు చేసిన మేలు, ఆయన పథకాల ద్వారా ఎస్సీలు ఎలా లబ్ధిపొందారో పుస్తకంలో వివరించినట్టు చెప్పారు. డాక్టర్‌ ప్రశాంత్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top