రాజన్న ఆశయాలు నెరవేర్చే నాయకుడు జగన్‌

Bhumana Karunakar In Praja Sankalpa Yatra - Sakshi

22న టెక్కలి బహిరంగ సభను విజయవంతం చేయాలి

వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి

శ్రీకాకుళం ,టెక్కలి: నిరంతరం ప్రజల కోసం తపించిన దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను నెరవేర్చగలిగే నాయకుడు ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఈ నెల 22న టెక్కలిలో జరగబోయే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ సభ విజయవంతం కోసం ఆదివారం టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ  ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత చేస్తున్న సుదీర్ఘమైన పాదయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.

టెక్కలిలో జరగబోయే బహిరంగ సభతో మంత్రి అచ్చెన్నాయుడు హడలిపోయి రాజకీయం అంటే విరక్తి కలగాలన్నారు. కార్యక్రమంలో రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, పార్టీ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వా డ శ్రీనివాస్, పార్టీ నాయకులు యర్ర చక్రవర్తి, చింతాడ మంజు, నాలుగు మండలాల కన్వీనర్లు బి.గౌరీపతి, ఎస్‌.హేమసుందర్‌రాజు, బి.మోహన్‌రెడ్డి నాయకులు ఎస్‌.రాఘవరావు, కె.చిన్నబాబు, గణపతి, ఎస్‌.సత్యం, హనుమంతు కిరణ్,  ఎన్‌.శ్రీరామ్ముర్తి, బి.నాగేశ్వరరావు, ఎ.రామారావు, టి.జానకిరామయ్య, టి.కిరణ్,  కె.సతీష్, కె.నారాయణమూర్తి, చిన్ని జోగారావు, బి.హరి, గురునాధ్, డి.వెంకట్రావు, జయరాం, ఎం.సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top