వైఎస్సార్సీపీ వైపే..
విజయనగరం :రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఉపకులాలన్నీ వైఎస్సార్సీపీ వైపు ఆకర్షితులవుతున్నాయి. గుంటూరు జిల్లాలో వడ్డెర కులస్తులకు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తానని ప్రకటించడం ఆనందించదగ్గ విషయం. బీసీ ఉపకులాలకు ప్రాధాన్యత కల్పిస్తున్న పార్టీ వైఎస్సార్సీపీయే.– ఇంటూరు, బాబ్జీనంద, లలిత్ ప్రజాపతి, వినుకొండ వెంకటసుబ్బారావు, బీసీ కులాల ఐక్యవేదిక ప్రతినిధులు
తాగునీటి సమస్య తీరలేదు..
తారాపురం ఎస్సీ కాలనీ, దుంప వీధి, ఇసుకపేటల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పదేళ్లుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మాలాంటి వారికి న్యాయం జరుగుతుంది. – తారాపురం వాసులు