ఇద్దరు డ్రైవర్ల నిబంధనను రద్దు చేయాలన్నా..

Ban To Two Drivers Rule - Sakshi

తూర్పుగోదావరి : నేషనల్‌ పర్మిట్‌ గల గూడ్స్‌ రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్ల నిబంధనను రద్దు చేయాలని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అనపర్తి శ్రీ అయ్యప్ప నేషనల్‌ పర్మిట్‌ లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసొసియేషన్‌ నాయకులు కోరారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పెదపూడి క్యాంపు కార్యాలయం వద్ద వైఎస్‌ జగన్‌ను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చిర్ల అమ్మిరెడ్డి, గొలగూరి ధర్మారెడ్డి, పెడల వెంకటరెడ్డి పెరుగుతున్న పెట్రోల్‌ ధరలను తగ్గించాలని, గడువు ముగిసిన టోల్‌ప్లాజాలను మూసివేయాలని, థర్డ్‌ పార్టీ ప్రీమియం పెంపును నిలిపివేయాలని, జీఎస్టీ, ఈ వేబిల్‌ సమస్యలు పరిష్కరించాలని ఇలా పలు సమస్యలను జగన్‌కు వివరించారు. ఈ నెల 20న ఆలిండియా లారీల నిరవధిక బంద్‌ పోస్టర్లను జగన్‌తో ఆవిష్కరింపజేయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top